చెక్డ్యామ్లో ఇద్దరు విద్యార్థులు గల్లంతు
ABN , First Publish Date - 2021-10-26T00:47:25+05:30 IST
జిల్లాలోని మొయినాబాద్ మండలంలోని వెంకటాపూర్ గ్రామ చెక్డ్యామ్లో
రంగారెడ్డి: జిల్లాలోని మొయినాబాద్ మండలంలోని వెంకటాపూర్ గ్రామ చెక్డ్యామ్లో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. గాల ఈసీ వాగు చెక్డ్యామ్లో ఈత కోసం విద్యార్థులు దిగారు. ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు రాసి తిరిగి వస్తున్న సమయంలో ముగ్గురు కలసి సరదాగా ఈత కోసం చెక్డ్యామ్లోకి విద్యార్థులు వెళ్లారు. అయితే వారికి ఈత రాకపోవడంతో వారిలోని ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. విద్యార్థుల ఆచూకీ కోసం గజ ఈతగాళ్ల సహాయంతో మొయినాబాద్ పోలీసులు జల్లెడ పడుతున్నారు.