రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
ABN , First Publish Date - 2020-08-02T10:53:20+05:30 IST
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
మరొకరికి తీవ్రగాయాలు
వివాహ కార్యక్రమానికి హాజరై వస్తుండగా దుర్ఘటన
గిద్దలూరు టౌన్, ఆగస్టు 1: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి మార్కెట్ యార్డు వద్ద జరిగింది. గిద్దలూరు మండలం పొదలకొండపల్లి గ్రామానికి చెందిన చేరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి (20), గొంటు సుదర్శన్రెడ్డి (20), రవీంద్రారెడ్డి కంభం మండలం తురిమెళ్ళ గ్రామంలో వివాహ కార్యక్రమానికి వె ళ్లారు. వీరితోపాటు మరికొందరు కూడా మోటార్బైక్లపై వెళ్ళారు. విందు అనంతరం గ్రామానికి బయలుదేరారు.ఈక్రమంలో గిద్దలూరు సమీపంలోని మార్కెట్యార్డు వద్ద ఆగిఉన్న ఇసుక టిప్పర్ను ఢీ కొట్టారు. మోటారు సైకిల్ నడుపుతున్న విష్ణువర్ధన్రెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా, సుదర్శన్రెడ్డి, రవీంద్రారెడ్డిలకు తీవ్రగాయాలయ్యాయి. మిగతా స్నేహితులు ప్రమాద సమాచారాన్ని బంధువులకు, 108కు తెలిపారు.
గాయపడిన సుదర్శన్రెడ్డి, రవీంద్రారెడ్డిలను మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలిస్తుండగా సుదర్శన్రెడ్డి మఽధ్యలో మృతిచెందాడు. రవీంద్రారెడ్డి ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఒకేసారి ఇరువురు యువకులు మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుదర్శన్రెడ్డి ఒక్కడే కుమారుడు కావడంతో తల్లిదండ్రులు రామక్రిష్ణారెడ్డి, సుబ్బలక్ష్మమ్మ గుండెలవిసేలా రోదిస్తున్నారు. మృతదేహాలకు శనివారం పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.