ఫరూక్ అబ్దుల్లాకు షాక్..ఇద్దరు ప్రముఖుల రాజీనామా

ABN , First Publish Date - 2021-10-11T01:53:36+05:30 IST

జమ్మూ: ఫరూక్ అబ్దుల్లా సారథ్యంలోని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ)కి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ ప్రముఖ నేతలు దేవేంద్ర రాణా, సూర్జిత్ సింగ్ స్లతియాలు ఆదివారంనాడు

ఫరూక్ అబ్దుల్లాకు షాక్..ఇద్దరు ప్రముఖుల రాజీనామా

జమ్మూ: ఫరూక్ అబ్దుల్లా సారథ్యంలోని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ)కి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ ప్రముఖ నేతలు దేవేంద్ర రాణా, సూర్జిత్ సింగ్ స్లతియాలు ఆదివారంనాడు పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ ఇరువురూ సోమవారంనాడు న్యూఢిల్లీలో బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. రాణా, స్లితాయా రాజీనామాలు డాక్టర్ ఫరూక్ అబ్దుల్లాకు అందాయని, వాటిని ఆయన ఆమోదించారని ఎన్‌సీ ప్రతినిధి ట్వీట్ చేశారు.


కాగా, తన రాజీనామా విషయాన్ని జమ్మూ రీజియిన్ ఎన్‌సీ ప్రొవిన్షియల్ ప్రెసిడెంట్ రాణా ధ్రువీకరించారు. ఆయన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌‌కు రాణాకు స్వయానా తమ్ముడు కావడం విశేషం. జమ్మూప్రజల ప్రయోజనాలు, వారి ఆశలు, ఆకాంక్షలే తనను ప్రధానమని రాణా తెలిపారు. ఎన్‌‌సీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి దెబ్బగా అనుకుంటున్నారా అనే ప్రశ్నకు..వ్యక్తులు వస్తుంటారు, వెళ్తుంటారని, ఎన్‌సీ చాలా పెద్ద పార్టీ అయినందున ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చని అన్నారు. తనకు ఫరూక్ అబ్దుల్లాతోనూ, ఆయన తనయుడు ఒమర్ అబ్దుల్లాతోనూ సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు.

Updated Date - 2021-10-11T01:53:36+05:30 IST