Jammuలో లోయలో పడిన కారు...ఇద్దరి మృతి, ఆరుగురికి గాయాలు

ABN , First Publish Date - 2022-06-01T13:09:31+05:30 IST

జమ్మూకశ్మీరులోని మిందాల్ మాత యాత్రలో సోమవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది....

Jammuలో లోయలో పడిన కారు...ఇద్దరి మృతి, ఆరుగురికి గాయాలు

జమ్మూ: జమ్మూకశ్మీరులోని మిందాల్ మాత యాత్రలో సోమవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. మిందాల్ మాత యాత్రకు వెళుతున్న యాత్రికుల కారు ప్రమాదవశాత్తూ కిష్టావర్ సోహల్ ప్రాంతంలోని షాండేరి నుల్లా వద్ద లోయలో పడిపోయింది. మిందాల్ మాత యాత్రకు 8 మంది యాత్రికులు కారులో వెళుతుండగా కిష్టావర్ జిల్లాలో అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు.మృతుల్లో ఒకరిని జమ్మూకు చెందిన మంగత్ రామ్ (55)గా గుర్తించారు. మృతుల్లో మరొకరి గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను కిష్త్వార్‌లోని ఆసుపత్రికి తరలించారు.


Updated Date - 2022-06-01T13:09:31+05:30 IST