మండలానికి రెండు పీహెచ్‌సీలు

ABN , First Publish Date - 2021-10-26T03:43:49+05:30 IST

వెంకటగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రెండు పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.

మండలానికి రెండు పీహెచ్‌సీలు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి

 ఎమ్మెల్యే ఆనం

వెంకటగిరి(టౌన్‌), అక్టోబరు 25: వెంకటగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రెండు పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక స్పందన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నియంత్రణలో డాక్టర్లు, నర్సులు, అధికారులు బాగా పనిచేశారని కొనియాడారు. ప్రతి పీహెచ్‌సీలో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. వెంకటగిరి, డక్కిలి, రాపూరు, సైదాపురం, కలువాయి, బాలాయపల్లి మండలాల్లో అన్ని పీహెచ్‌సీల్లో అదనపు గదుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయన్నారు. వసంత లక్ష్మీ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని ఆసుపత్రుల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తారన్నారు.  వ్యవసాయ పరికరాలు కూడా అందజేస్తారని తెలిపారు.  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నక్కా భానుప్రియ, జిల్లా గ్రంఽథలయ చైర్మన్‌ దొంతు శారద, జడ్పీటీసీ సభ్యుడు కోలా వెంకటేశ్వర్లు, ఎంపీపీ తనుజా రెడ్డి, పూజారి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-26T03:43:49+05:30 IST