రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2020-07-30T16:00:50+05:30 IST
గుంటూరు: నిజాంపట్నం మండలం గోకర్ణమట్టం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ఓ కారు కాలువలో పడిపోయింది.
గుంటూరు: నిజాంపట్నం మండలం గోకర్ణమట్టం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ఓ కారు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని స్థానికులు రేపల్లె హాస్పిటల్కి తరలించారు. మృతులు కర్లపాలెం ప్రాంత వాసులుగా గుర్తించారు. పెళ్లి వేడుకకు వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఒకరు హోం గార్డ్గా గుర్తించారు.