ప్రమాదవశాత్తు బావిలో పడి ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2020-09-18T20:09:41+05:30 IST
విజయవాడ: బావిలో పడి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
విజయవాడ: బావిలో పడి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కృష్ణా జిల్లా నూజివీడు మండలం పోనసనపల్లి గ్రామానికి చెందిన 8 మంది కూలీలు మల్లవల్లి గ్రామానికి బావి పూడ్చేందుకు వచ్చారు. పాత బావి పూడ్చే క్రమంలో ప్రమాదవశాత్తు నలుగురు వ్యక్తులు బావిలో పడిపోయారు. వారిలో ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన వారు అచ్చి తిరుపతయ్య(60), అచ్చి రమేష్ (40)గా గుర్తించారు. పాత బావిలో మట్టిలో పూడుకుపోయిన మృతదేహాల కోసం జేసీబీతో అధికారులు వెదుకుతున్నారు.