రంగారెడ్డి జిల్లాలో గోడకూలి ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-12-26T18:24:13+05:30 IST

జిల్లాలో విషాదం ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు గోడకూలి ఇద్దరు యువకులు మృతిచెందారు.

రంగారెడ్డి జిల్లాలో గోడకూలి ఇద్దరు మృతి

రంగారెడ్డి: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు గోడకూలి ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ ఘటన శంకర్పల్లిలోని బుల్కాపూర్ గ్రామంలో ఆదివారం జరిగింది. పాత ఇంటి మరమ్మతుల కోసం గోడను కులుస్తున్న సమయంలో యువకుల మీద రాళ్లు పడడంతో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. మధు, శ్రీకాంత్ అనే ఇద్దరూ యువకులు  అక్కడికక్కడే మృతిచెందారు. సంవత్సరం క్రితం వీరిద్దరికీ వివాహం జరిగింది. ఈ ఘటనపై శంకర్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-26T18:24:13+05:30 IST