TS news: వరంగల్‌లో విషాదం...నిశ్చితార్ధం రోజే యువకుడు మృతి

ABN , First Publish Date - 2022-07-23T13:42:03+05:30 IST

జిల్లాలోని మండిబజార్‌లో విషాదం చోటు చేసుకుంది. నిశ్చితార్ధం రోజే ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

TS news: వరంగల్‌లో విషాదం...నిశ్చితార్ధం రోజే  యువకుడు మృతి

వరంగల్: జిల్లాలోని మండిబజార్‌లో విషాదం చోటు చేసుకుంది. నిశ్చితార్ధం రోజే ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. భారీ వర్షాల కారణంగా ఈరోజు తెల్లవారుజామున  ఒక్కసారిగా ఓ ఇంటి గోడ కూలడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా 60ఏళ్ల వృద్ధుడు, ఫిరోజ్(20) అనే యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందారు. సమ్మక్క అనే మహిళ  ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చనిపోయిన ఫిరోజుకు ఈరోజు నిశ్చితార్ధం జరగాల్సి ఉంది. అంతలోనే ఘోరం జరగడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Updated Date - 2022-07-23T13:42:03+05:30 IST