వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2022-10-07T06:20:02+05:30 IST
జిల్లా పరిధిలో బుధవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు.
యాదమరి/నగరి, అక్టోబరు 6: జిల్లా పరిధిలో బుధవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. యాదమరి మండల పరిధిలోని వరిగిపల్లె వద్ద చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని బైరెడ్డిపల్లె మండలం ఎర్రకదిరిపల్లెకు చెందిన రామయ్య (55) మృతిచెందాడు. బోరు పాయింట్ పెట్టడానికి బుధవారం సాయంత్రం ఆయన యాదమరికి వచ్చాడు. వరిగిపల్లె వద్ద హైవే ఫ్లైఓవర్పై నడిచి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 ద్వారా చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి తరలిస్తుండగా మరణించారు. అదేవిధంగా నగరి పట్టణ పరిధిలోని బైపాస్ రోడ్డు ఏజేఎస్ కల్యాణ మండపం సమీపంలో గుర్తు తెలియని వాహనం మోటారు బైక్ను ఢీకొనడంతో పౌల్ మృతి చెందాడు. పొన్నప్పన్ తీవ్రంగా గాయపడ్డాడు. నగరి మండలం మేళపట్టు దళితవాడకు చెందిన పౌల్, పొన్నప్పన్ బైక్లో వెళుతుండగా కల్యాణమండపం సమీపంలో వెనుక వైపు నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొంది. పౌల్ అక్కడికక్కడే మృతి చెందగా పొన్నప్పన్ తీవ్ర గాయాలతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐలు సుమన్, శివశంకర్ తెలిపారు.