ముంబైలో విస్తరిస్తున్న ఒమైక్రాన్.. వెలుగులోకి మరో రెండు కేసులు
ABN , First Publish Date - 2021-12-07T02:38:09+05:30 IST
దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ నెమ్మదిగా విస్తరిస్తోంది. నిన్న కొత్తగా 17 మంది ఈ కొత్త వేరియంట్ బారినపడడంతో..
ముంబై: దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా పాకుతోంది. నిన్న కొత్తగా 17 మంది ఈ కొత్త వేరియంట్ బారినపడడంతో దేశంలోని మొత్తం కేసుల సంఖ్య 21కి పెరిగింది. వాటిలో 9 కేసులు జైపూర్లో వెలుగు చూడగా, ఏడు పుణెలో, ఒకటి ఢిల్లీలో బయటపడింది. తాజాగా, నేడు ముంబైలో మరో రెండు కేసులను అధికారులు గుర్తించారు.
వీటితో కలుపుకుని రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య పదికి పెరగ్గా, దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 23కి చేరుకుంది. తాజాగా వెలుగు చూసిన రెండు కేసుల్లో ఓ వ్యక్తి (37) దక్షిణాఫ్రికా నుంచి రాగా, మరో బాధితుడు (36) అమెరికా నుంచి వచ్చినట్టు అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటి వరకు ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్లలో కొత్త వేరియంట్ వెలుగు చూసింది.