మరో రెండు కేసులు

ABN , First Publish Date - 2020-06-02T09:41:36+05:30 IST

జిల్లాలో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం సాయంత్రం వరకూ పుత్తూరులో

మరో రెండు కేసులు

286కు చేరిన పాజిటివ్‌ల సంఖ్య

యాక్టివ్‌ కేసులు 87


తిరుపతి, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం సాయంత్రం వరకూ పుత్తూరులో మూడు, శ్రీకాళహస్తి, కేవీబీపురాల్లో ఒక్కొక్కటి చొప్పున ఐదు కేసులను స్విమ్స్‌ ల్యాబ్‌ నిర్ధారించగా సాయంత్రం తర్వాత పుత్తూరు, నిండ్ర మండలాల్లో రెండు కేసులు వెలుగు చూశాయి. దీంతో ఆదివారం మొత్తం ఏడు కేసులు నమోదైనట్టయింది. చివరి రెండు కేసుల్లో పుత్తూరు మండలానికి చెందిన 12 ఏళ్ళ బాలిక, నిండ్ర మండలానికి చెందిన 45 ఏళ్ళ మహిళ వున్నారు.


వీరిద్దరూ కూడా ముంబై నుంచీ వచ్చిన వలస కార్మికుల కుటుంబీకులుగా అధికారులు గుర్తించారు. వీరితో కలిపి జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 286కు చేరుకోగా వీరిలో ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే.197 మంది కరోనా వైరస్‌ నుంచీ కోలుకుని ఆస్పత్రుల నుంచీ డిశ్చార్జి కాగా 87 మంది  ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.సోమవారం సాయంత్రం వరకూ జిల్లాలో కరోనా కేసులేవీ నమోదు కాలేదు. చాలా రోజుల తర్వాత ఇలా 12 గంటలకు మించి కేసులేవీ నమోదు కాకపోవడం ఇదే ప్రథమం.

Updated Date - 2020-06-02T09:41:36+05:30 IST