శ్రీకాకుళం : సముద్రతీరంలో ఇద్దరు గల్లంతు

ABN , First Publish Date - 2020-10-19T04:08:08+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగైదు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్న విషయం విదితమే.

శ్రీకాకుళం : సముద్రతీరంలో ఇద్దరు గల్లంతు

శ్రీకాకుళం : తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగైదు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్న విషయం విదితమే. ఈ వర్షాలతో ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడ చెరువు కట్టలు తెగిపోవడంతో వాహనాలు, జనాలు సైతం కొట్టుకుపోతున్న పరిస్థితి నెలకొంది. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలం రట్టి సముద్రతీరంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఆరుగురు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. కమలాపురానికి చెందిన జాయి శ్రీకాంత్ (18), సిరియాపల్లికి చెందిన సిసింద్రీ(18)గా స్థానికులు, అధికారులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, సహాయ సిబ్బంది తీరంలో వెతుకుతున్నారు.

Updated Date - 2020-10-19T04:08:08+05:30 IST