వీళ్లు ముగ్గురూ ప్రాణ స్నేహితులే.. అందులో ఇద్దరు కలిసి ఒకరిని చంపేశారు.. అసలు కారణమేంటని పోలీసులు ఆరా తీస్తే..

ABN , First Publish Date - 2022-06-14T18:38:31+05:30 IST

పై ఫొటోలో కనిపిస్తున్న ముగ్గురూ ప్రాణ స్నేహితులు.. అందరి వయసూ దాదాపు 20 ఏళ్లే..

వీళ్లు ముగ్గురూ ప్రాణ స్నేహితులే.. అందులో ఇద్దరు కలిసి ఒకరిని చంపేశారు.. అసలు కారణమేంటని పోలీసులు ఆరా తీస్తే..

ఆ ముగ్గురూ ప్రాణ స్నేహితులు.. అందరి వయసూ దాదాపు 20 ఏళ్లే.. ఆదివారం సాయంత్రం ఈ ముగ్గురూ కలిసి ఓ టీ దుకాణం వద్దకు వెళ్లారు.. సరదాగా నవ్వుతూ టీ తాగారు.. ఆ తర్వాత ముగ్గురి మధ్య వాగ్వాదం మొదలైంది.. అందులో ఇద్దరు స్నేహితులు తీవ్ర ఆగ్రహానికి గురై మూడో వ్యక్తిని కత్తితో పొడిచి చంపేసి పారిపోయారు.. తర్వాతి రోజు ఉదయం పోలీసులకు దొరికిపోయారు.. స్నేహితుడిని ఎందుకు చంపారో విచారణలో వెల్లడించారు. 


ఇది కూడా చదవండి..

సరిగ్గా నెల రోజుల క్రితం పెళ్లి.. కొత్త కోడలికి టీ చేసి ఇచ్చిన అత్త.. క్షణాల్లోనే ఇంట్లో ఊహించని సీన్..!


ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన యశ్ సింగ్ రాజ్‌పుత్ (20), విక్కీ దివాకర్ (20), అనిల్ లాహిరి (19) ప్రాణ స్నేహితులు. విక్కీ కొంత కాలంగా ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఆమెతోనే యశ్ కూడా తరచుగా మాట్లాడేవాడు. తన ప్రేయసికి యశ్ తరచుగా ఫోన్ చేసి మాట్లాడుతున్నట్టు విక్కీకి తెలిసింది. దీంతో యశ్‌కు వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయినా యశ్ మాత్రం మాట్లాడడం మానలేదు. ఆదివారం సాయంత్రం స్నేహితులు ముగ్గురూ ఓ టీ దుకాణం వద్దకు వెళ్లారు. ముందు నవ్వుతూనే మాట్లాడుకున్నారు. 


ఆ తర్వాత వారి మధ్య అమ్మాయి టాపిక్ వచ్చింది. విక్కీకి అనిల్ మద్దతుగా నిలిచాడు. ఆ అమ్మాయితో మాట్లాడవద్దని యశ్‌ను విక్కీ, అనిల్ హెచ్చరించారు. యశ్ వారికి ఎదురుతిరగడంతో ఇద్దరూ కత్తితో దాడి చేశారు. తమతో తెచ్చుకున్న కత్తిని బయటకు తీసి యశ్‌ను పలుచోట్ల పొడిచారు. యశ్ అక్కడికక్కడే మరణించడంతో ఇద్దరూ పారిపోయారు. తర్వాతి రోజు ఉదయం పోలీసులకు దొరికిపోయారు.   

Updated Date - 2022-06-14T18:38:31+05:30 IST