కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
ABN , First Publish Date - 2020-07-01T08:37:32+05:30 IST
కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అనంత్నాగ్ జిల్లాలోని వాగాహమా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని బలగాలకు సమాచారం అందింది...
శ్రీనగర్, జూన్ 30: కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అనంత్నాగ్ జిల్లాలోని వాగాహమా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని బలగాలకు సమాచారం అందింది. దీంతో బలగాలు గాలింపు చర్యలు చేపడుతుంగా వారికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి.