కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

ABN , First Publish Date - 2020-07-01T08:37:32+05:30 IST

కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అనంత్‌నాగ్‌ జిల్లాలోని వాగాహమా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని బలగాలకు సమాచారం అందింది...

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌, జూన్‌ 30: కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అనంత్‌నాగ్‌ జిల్లాలోని వాగాహమా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని బలగాలకు సమాచారం అందింది. దీంతో బలగాలు గాలింపు చర్యలు చేపడుతుంగా వారికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి.  


Updated Date - 2020-07-01T08:37:32+05:30 IST