షాకింగ్ ఘటన.. 20 ఏళ్ల కుర్రాడిపై చెరకుతోటలో అత్యాచారం.. వాకింగ్‌కు అని సాయంత్రం బయటకు వెళ్తే..

ABN , First Publish Date - 2021-10-17T23:58:27+05:30 IST

దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు పరిధికి చెందిన 20 ఏళ్ల యువకుడు శుక్రవారం సాయంత్రం సరదాగా వాకింగ్‌కు వెళ్లాడు. స్థానిక రైల్వే ట్రాక్ వద్ద అదే గ్రామానికి చెందిన మహ్మద్ హనీఫ్ అనే వ్యక్తి తారసపడ్డాడు. చెరుకు సరం తాగుదాం రమ్మంటూ..

షాకింగ్ ఘటన.. 20 ఏళ్ల కుర్రాడిపై చెరకుతోటలో అత్యాచారం.. వాకింగ్‌కు అని సాయంత్రం బయటకు వెళ్తే..

అత్యాచార ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. కామాంధులు కన్నూమిన్నూ కానకుండా, చిన్నా పెద్దా చూడకుండా అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఎన్ని కఠిన శిక్షలు అమలు చేస్తున్నా.. వారిలో మాత్రం మార్పు రావడం లేదు. బాలికలు, మహిళలు, వృద్ధులను కూడా వదిలిపెట్టడంలేదు. కామాంధులకు ఆడ, మగ, హిజ్రాలు అనే తేడాలు ఉండవనడానికి.. ఇటీవల కర్ణాటకలో జరిగిన దారుణాలే ఉదాహరణ. ఓ యువకుడు సాయంత్రం వాకింగ్ వెళ్తే.. కామాంధులు అతనిపై కన్నేశారు. అలాగే మరో ఘటనలో ఓ యువకుడిపై అత్యాచారం జరిగింది. వివరాల్లోకి వెళితే..


దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు పరిధికి చెందిన 20 ఏళ్ల యువకుడు శుక్రవారం సాయంత్రం సరదాగా వాకింగ్‌కు వెళ్లాడు. స్థానిక రైల్వే ట్రాక్ వద్ద అదే గ్రామానికి చెందిన మహ్మద్ హనీఫ్ అనే వ్యక్తి తారసపడ్డాడు. చెరుకు సరం తాగుదాం రమ్మంటూ.. యువకుడిని నమ్మించి, సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయట చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇంటికి వచ్చిన అతడు భయపడుతూ ఉండడాన్ని గమనించిన తండ్రి.. ఏం జరిగిందని ప్రశ్నించాడు. దీంతో విషయం బయటపడింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హనీఫ్‌ను అరెస్ట్ చేశారు.


అదేవిధంగా మరో ఘటనలో బెల్గాం జిల్లాకు చెందిన 24 ఏళ్ల యువకుడిపై అత్యాచారం జరిగింది. అంతాని అనే పట్టణానికి చెందిన వ్యక్తి హోటల్‌లో హెల్పర్ గా పని చేస్తుంటాడు. ఈ నెల 5న పని ముగించుకుని బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. అదే సమయంలో గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి మాయ మాటలు చెప్పి యువకుణ్ని బైక్ మీద తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు రాజును అరెస్టు చేశారు.

Updated Date - 2021-10-17T23:58:27+05:30 IST