గాలి కొడుతుండగా టైర్ పేలి ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-05-05T19:43:00+05:30 IST

కొంత మంది ఒక మెకానిక్ షాపులో ఉన్నారు. అందులో ఒక వ్యక్తి బుల్డోజర్ టైర్‌లో గాలి నింపుతున్నారు. ఒక వ్యక్తి వచ్చి గాలి ఎంత వరకు నిండిందో కర్రతో కొట్టి చూసి వెళ్లిపోయాడు. ఇంకొక వ్యక్తి వచ్చి టైర్‌పై కూర్చొని గాలి ఎంత ఎక్కిందని చూస్తున్నాడు. గాలి అప్పటికే బాగా ఎక్కువైంది కాబోలు.. ఒక్కసారిగా టైర్ పేలింది..

గాలి కొడుతుండగా టైర్ పేలి ఇద్దరు మృతి

రాయ్‌పూర్: రోజూ చేసేవే అయినా, ఎంతో అనుభవం ఉన్నప్పటికీ ఏ పనైనా కొంచెం ఆచీతూచీ చేయాలని అంటారు. లేదంటే పరిణామాలు ఏ విధంగానైనా ఉండవచ్చు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహారణ. ఒక మెకానిక్ షాప్‌లో టైర్‌కు గాలి కొడుతుండగా అదే టైర్ పేలి ఇద్దరు వ్యక్తులు మరణించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


వీడియో ప్రకారం.. కొంత మంది ఒక మెకానిక్ షాపులో ఉన్నారు. అందులో ఒక వ్యక్తి బుల్డోజర్ టైర్‌లో గాలి నింపుతున్నారు. ఒక వ్యక్తి వచ్చి గాలి ఎంత వరకు నిండిందో కర్రతో కొట్టి చూసి వెళ్లిపోయాడు. ఇంకొక వ్యక్తి వచ్చి టైర్‌పై కూర్చొని గాలి ఎంత ఎక్కిందని చూస్తున్నాడు. గాలి అప్పటికే బాగా ఎక్కువైంది కాబోలు.. ఒక్కసారిగా టైర్ పేలింది. టైర్‌పై కూర్చొని గాలి కొడుతున్న వ్యక్తి, సహా పక్కన ఉండి గాలి చెక్ చేస్తున్న వ్యక్తి ఇద్దరు మరణించారు. వీరిద్దరదూ మధ్యప్రదేశ్‌లోని సత్నాకు చెందిన రాజ్‌పాల్ సింగ్, ప్రంజన్ నాందేవ్‌లు అని సమాచారం.

Read more