జనాలపైకి కోతులను వదులుతూ లూటీలు... ఇద్దరు అరెస్ట్!

ABN , First Publish Date - 2021-04-11T12:56:54+05:30 IST

జనాలపైకి కోతులను వదులుతూ...

జనాలపైకి కోతులను వదులుతూ లూటీలు... ఇద్దరు అరెస్ట్!

న్యూఢిల్లీ: జనాలపైకి కోతులను వదులుతూ వారి నుంచి నగదు, విలువైన వస్తువుల లూటీకి పాల్పడుతున్న ఇద్దరు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరికి సహకరిస్తున్న మరో వ్యక్తి పరారయ్యాడు. నిందితులు మూడు నెలల క్రితం తుగ్లకాబాద్ అడవి నుంచి కోతులను తెచ్చారని పోలీసుల విచారణలో తేలింది. రెండు కోతులను పోలీసులు స్వాధీనం చేసుకుని వాటిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. 




ఈ నిందితుల ద్వారా మోసపోయిన వారి గురించి తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే దక్షిణ ఢిల్లీ పోలీసులు మాలవీయ్ నగర్ ప్రాంతంలో కోతులను ఆడిస్తూ జనాలను భయపెడుతూ, లూటీలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ నాథ్(26), విక్రమ్ నాథ్(23) అనే ఇద్దరు నిందితులు చిరాగ్ ఢిల్లీ బస్టాండ్ వద్ద నుండగా పట్టుకున్నామన్నారు.

Updated Date - 2021-04-11T12:56:54+05:30 IST