చోరీ కేసులో ఇద్దరి అరెస్టు
ABN , First Publish Date - 2021-01-24T05:57:41+05:30 IST
చోరీ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. కొడాలి ఆంధ్రా బ్యాంక్ వద్ద అదే గ్రామానికి చెందిన గుమ్మడి హరిబాబు వద్ద నుంచి ఈ నెల 4వ తేదీన రూ.31 వేలు దొంగిలించి ఇద్దరు వ్యక్తులు బైక్పై పారిపోయారన్నారు.
ఘంటసాల, జనవరి 23 : చోరీ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. కొడాలి ఆంధ్రా బ్యాంక్ వద్ద అదే గ్రామానికి చెందిన గుమ్మడి హరిబాబు వద్ద నుంచి ఈ నెల 4వ తేదీన రూ.31 వేలు దొంగిలించి ఇద్దరు వ్యక్తులు బైక్పై పారిపోయారన్నారు. దీనిపై బాధితుడు హరిబాబు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై తెలిపారు. దొంగతనం జరిగిన ప్రాంతంలోని సీసీ పుటేజీల ఆధారంగా చోరీకి పాల్పడిన వ్యక్తులను గుర్తించామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం సమత నగర్కు చెందిన నల్లూరి నాగకిషోర్, గాదె కనకరాజులుగా గుర్తించి వారిని నుంచి రూ.30 వేలు, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.