ఇద్దరు మావోయిస్టులు లొంగుబాటు

ABN , First Publish Date - 2021-08-22T00:59:39+05:30 IST

మావోయిస్టు పార్టీ ఎల్‌ఓఎస్‌కు చెందిన ఇద్దరు సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ సమక్షంలో శనివారం లొంగిపోయారు.

ఇద్దరు మావోయిస్టులు లొంగుబాటు

కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ ఎల్‌ఓఎస్‌కు చెందిన ఇద్దరు సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ సమక్షంలో శనివారం లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాకు చెందిన చర్ల ఎల్‌వోఎస్‌ సభ్యులు గట్టు సురేష్‌, సుకుమా జిల్లాకు చెందిన ఎల్‌వోఎస్‌ సభ్యులు బోడికె భీమయ్య అలియాస్‌ భీమన్న లొంగిపోయారు. గత ఆరు సంవత్సరాలుగా ఈ ఇద్దరు సభ్యులు మావోయిస్టు పార్టీలో పని చేస్తున్నారని, మొదటగా మిలిషియా సభ్యులుగా చేరిని వీరు మూడు సంవత్సరాల నుంచి చర్ల ఎల్‌ఓఎస్‌ సభ్యులుగా పని చేస్తున్నారని ఎస్పీ సునీల్‌దత్‌ వివరించారు. తెలంగాణ స్టేట్‌ కమిటీ మావోయిస్టు నాయకులు వారి క్రిందిస్థాయి క్యాడర్‌ను వేదింపులకు గురి చేస్తూ వారిని జనజీవన స్రవంతిలో కలవకుండ అడ్డుపడుతున్నారని తెలిపారు. చాలామంది దళ సభ్యులు, మిలిషియా సభ్యులు మావోయిస్టు పార్టీని వీడి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారని సునీల్‌దత్‌ తెలిపారు

Updated Date - 2021-08-22T00:59:39+05:30 IST