చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు మృతి
ABN , First Publish Date - 2022-05-18T05:04:42+05:30 IST
రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతు న్న 15నెలల జస్మిత, 12 ఏళ్ల సౌజన్య మృతి చెందినట్లు పోలీసులు తెలి పారు.
చక్రాయపేట, మే 17: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతు న్న 15నెలల జస్మిత, 12 ఏళ్ల సౌజన్య మృతి చెందినట్లు పోలీసులు తెలి పారు. ఈస్ట్ గోదావరి జిల్లా అమలాపురం మండలం ముమ్మిడివరం గ్రామస్తులు కొందరు తమ బంధువైన కడప విద్యుత్ నగర్ వాసి ఈ శ్వరమ్మ ఇంటికి వారం రోజుల కిందట వచ్చారు. వారు కదిరి నరసింహస్వామిని దర్శించుకోవాలని అంతా కలిసి సోమవారం ఏపీ04 ఏఆర్ 6686 నెంబరు చెవ్ర్లెట్ వాహనంలో అనంతపురం జిల్లా కదిరికి వెళ్లా రు.
అక్కడ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని రాత్రి 11గంట లకు తిరిగి కడపకు వస్తుండగా మార్గమధ్యలో సిద్దారెడ్డిగారిపల్లె వద్ద వేగంగా వస్తూ వాహనం అదుపుతప్పడంతో ఎరబొమ్మనపల్లె గ్రామం సిద్దారెడ్డిగారిపల్లె వద్ద బోల్తాపడింది. ఘటన లో 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రు లను వేంపల్లెకు తరలించి చికిత్స అందించారు. కాగా తీవ్రంగా గాయ పడిన ముగ్గురు చిన్నారుల్లో ఒకరు సోమవారమే మృతి చెందగా మరో ఇద్దరు చిన్నారుల్లో జస్మిత వేంపల్లెలో చనిపోగా, సౌజన్య తిరుపతిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మిగిలిన వారు తిరుపతిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.