అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 222 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు ఏపీలో మొత్తం 20,70,738 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 14,423 మరణాలు సంభవించాయి. ఏపీలో 2,560 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,53,755 మంది రికవరీ చెందారు.