కరోనాతో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2020-10-15T07:16:40+05:30 IST

కరోనా మహమ్మారితో మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది

కరోనాతో ఇద్దరి మృతి

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): కరోనా మహమ్మారితో మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లాలో బుధవారం కరోనాతో ఇద్దరు మృతి చెందారు. మృతులిద్దరూ జీహెచ్‌ఎంసీ పరిధి వారే. దీంతో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో కరోనా మృతుల సంఖ్య 283కు చేరింది.


458 కేసులు..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బుధవారం 458 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 282, వికారాబాద్‌ జిల్లాలో 10, మేడ్చల్‌ జిల్లాలో 166 కేసులు నమోదయ్యాయి. మూడు జిల్లాల్లో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ సంఖ్య 89,930కి చేరింది.


షాద్‌నగర్‌ డివిజన్‌లో..

షాద్‌నగర్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో బుధవారం 152మందికి కరోనా యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించగా 10మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. వారిలో షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన నలుగురు, నందిగామ మండలానికి చెందిన ఇద్దరు, ఫరూఖ్‌నగర్‌ మండలానికి చెందిన ఇద్దరు, ఇతర మండలాలకు చెందిన మరో ఇద్దరు ఉన్నట్లు వివరించారు. 


ఇబ్రహీంపట్నం డివిజన్‌లో..

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం డివిజన్‌లో 11కేంద్రాల్లో 139 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 21మందికి పాజిటివ్‌ వచ్చింది. సీహెచ్‌సీ ఇబ్రహీంపట్నంలో 7, యాచారం 7, ఆరుట్ల 1, ఎలిమినేడు 2, రాగన్నగూడలో 4 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-10-15T07:16:40+05:30 IST