రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2021-04-13T05:20:32+05:30 IST

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
మృతిచెందిన దుర్గారెడ్డి

కీసర రూరల్‌: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో సోమవారం చోటుచేసుకున్న రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి. టాటా ఏస్‌, కారు ఢీకొన్న ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతిచెందిన సంఘటన కీసర మండలంలో చోటుచేసుకుం ది. నగరంలోని సైనిక్‌పురి డిఫెన్స్‌ కాలనీకి చెందిన తడ్కపల్లి దుర్గారెడ్డి(44) తన స్నేహితుడు హరికృష్ణగౌడ్‌(52)తో కలిసి కారులో యాదాద్రి భువనగిరి జిల్లా అనంతారంలోని తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి ఇంటికి బయల్దేరారు. కీసర మండలం తిమ్మాయిపల్లి శుభం గార్డెన్‌ వద్దకు రాగానే వారి కారు ఎదురుగా వస్తున్న టాటా ఏస్‌ వాహనాన్ని ఢీకొంది. దీంతో దుర్గారెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. టాటా ఏస్‌ డ్రైవర్‌ మహేందర్‌, హరికృష్ణగౌడ్‌లకు గాయాలయ్యాయి. వారిని నాగారంలోని విజయ, ఈసీఐఎల్‌లోని శ్రీకర ఆస్పత్రులకు తరలించారు. దుర్గారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌గౌడ్‌ తెలిపారు. 


  • ట్రాక్టర్‌ బోల్తా పడి వ్యక్తి ...

శామీర్‌పేట: ప్రహరీని ట్రాక్టర్‌ ఢీకొని బోల్తాపడి డ్రైవర్‌ మృతిచెందాడు. ఈ ఘటన మూడుచింతలపల్లి మండలం కేశవరంలో సోమవారం చోటుచేసుకుంది. కేశవరానికి చెందిన కొంగ కరుణాకర్‌ (32) తాత్కాలిక ట్రాక్టర్‌ డ్రైవర్‌గా వెళ్లి ప్రహరీని ఢీకొన్నాడు. అతడి తలకు గాయమై మృతిచెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కరుణాకర్‌కు భార్య, తల్లి ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-04-13T05:20:32+05:30 IST