రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2022-01-13T22:21:15+05:30 IST
జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత
విశాఖ: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. పెదవలస, కొయ్యూరు రోడ్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బూదరాళ్ల వెళుతున్న జీపు లోయలో పడింది. జీపులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని కొయ్యూరు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.