రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

ABN , First Publish Date - 2021-01-27T05:07:09+05:30 IST

చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారి రామా పురం మండలంలో మం గళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన శైలేంద్ర, పవన్‌కిశోర్‌

రామాపురం, జనవరి 26: చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారి రామా పురం మండలంలో మం గళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో రాయచోటి పట్టణం జగ దాంబ సెంటర్‌కు చెందిన తణుకు శైలేంద్ర (19), రామాలయంవీఽధికి చెందిన అలుచూరి పవన్‌కిశోర్‌ (20) మృతి చెందారు. రామా పురం పోలీసుల కథనం మేరకు... ఆ ఇద్దరు యువకులు ఇంజినీరింగ్‌ ఫీజు చెల్లించడానికి పల్సర్‌ వాహనంపై కడపకు వెళ్లారు. పని ముగించుకుని తిరిగి రాయచోటికి బయలుదేరారు. మార్గమధ్యంలో చిట్లూరు పంచాయతీ సోఫా ఫ్యాక్టరీ వద్ద   రాయచోటి వైపు నుంచి కడప వైపునకు వస్తున్న వ్యాన్‌ స్కూటర్‌ను ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రామాపురం ఎస్‌ఐ మైనుద్దీన్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తమై లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు. 

Updated Date - 2021-01-27T05:07:09+05:30 IST