ఇద్దరు ఆర్మీ అధికారులకు కరోనా పాజిటివ్!
ABN , First Publish Date - 2020-03-30T03:53:16+05:30 IST
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. భారత్లో కూడా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే దేశంలో 1024 మంది కరోనా పాజిటివ్గా తేలారు.
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. భారత్లో కూడా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే దేశంలో 1024 మంది కరోనా పాజిటివ్గా తేలారు. ఈ క్రమంలో ఇద్దరు ఆర్మీ అధికారులకు ఆదివారం చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. కోల్కతాలోని ఆర్మీ కమాండ్ ఆస్పత్రిలోని ఓ వైద్యుడికి కరోనా సోకిందని తెలుస్తోంది. ఇటీవలే ఢిల్లీ నుంచి కోల్కతా వచ్చిన ఆయనకు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షలు పాజిటివ్ ఫలితాలిచ్చాయట. దీంతో సదరు అధికారికి క్వారంటైన్ చేసిన ఆర్మీ.. ఆయన సహోద్యోగుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. అలాగే డెహ్రాడూన్లో జేసీవోగా విధులు నిర్వర్తిస్తున్న మరో జవాను కూడా కరోనా పాజిటివ్గా తేలాడు.
కాగా, శ్రీనగర్లోని ఓ జవానుకు కూడా కరోనా సోకిందని కొన్ని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను ఇండియ్ ఆర్మీ ఖండించింది. ఆదివారం నాడు ఇద్దరు ఆర్మీ అధికారులే కరోనా పాజిటివ్గా తేలారని స్పష్టంచేసింది.