ఇరువురు అంతర్‌ జిల్లాల దొంగలు అరెస్టు

ABN , First Publish Date - 2022-08-11T05:49:29+05:30 IST

పట్టపగలు ఇళ్లలో చోరీలకు పాల్పడే ఇరువురు అంతర్‌ జిల్లాల దొం గలను కురిచేడు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.30.72లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

ఇరువురు అంతర్‌ జిల్లాల దొంగలు అరెస్టు

17 కేసులను ఛేదించిన కురిచేడు పోలీసులు 

రూ.30.72లక్షల సొత్తు స్వాధీనం 

వెల్లడించిన ఎస్పీ మలికగర్గ్‌


ఒంగోలు(క్రైం), ఆగస్టు 10: పట్టపగలు ఇళ్లలో చోరీలకు పాల్పడే ఇరువురు అంతర్‌ జిల్లాల దొం గలను కురిచేడు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.30.72లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో 17దొంగతనాలు చేసినట్లు పోలీ సులు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఒం గోలులోని జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణం లో గల గెలాక్సీ భవన్‌లో జరిగిన మీడియా స మావేశంలో ఎస్పీ మలికగర్గ్‌ ఇందుకు సంబంధిం చిన వివరాలను వెల్లడించారు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం పెద్దకంచర్ల గ్రామానికి చెందిన గుడిపాటి వీరాంజి, శావల్వపురం మం డలం చినకంచర్ల గ్రామానికి చెందిన గోపు శ్రీని వాసరావును కురిచేడు పోలీసులు అరెస్టు చేశా రని తెలిపారు. వీరాంజి  దొంగతనాలు చేసి తెచ్చి న సొత్తును గోపు శ్రీనివాసరావుకు విక్రయిస్తూ ఉంటాడు. వీరి ఇరువురును కురిచేడులోని వెంగా యిపాలెం చెక్‌ పోస్టు వద్ద అరెస్టు చేసి వారి వద్ద 640 గ్రాములు బంగారం, మోటార్‌సైకిల్‌ను స్వా ధీనం చేసుకున్నారని ఎస్పీ తెలిపారు. వాటి వి లువ సుమారు రూ.30.72లక్షలు ఉంటుందన్నా రు. కాగా ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లే సమ యంలో ఇంట్లో విలువైన వస్తువులు ఉంచకూడ దని, పోలీసుల సహకారంతో లాక్డ్‌ మానిటర్‌ సి స్టమ్‌ను ఏర్పాటు చేయించుకోవాలన్నారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితు లు ఉంటే 100కు డయల్‌ చేయాలని ఎస్పీ కోరా రు. అలాగే అదనపు ఎస్పీ(క్రైం) ఎస్‌వీ.శ్రీధర్‌ రావు, దర్శి డీఎస్పీ నారయణస్వామిరెడ్డి, త్రిపు రాంతకం సీఐ ఎం.రాంబాబు, కురిచేడు ఎస్సై పి. శివనాగరాజులను ఎస్పీ అభినందించారు.  


మహిళ హత్య కేసులో.. 


మహిళ  హత్యకేసులో నిందితులను త్రిపురాం తకం పోలీసులు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నా రని ఎస్పీ మలికగర్గ్‌ తెలిపారు. త్రిపురాంతకం మండలం డీవీఎన్‌కాలనీకి చెందిన పొన్న అంక మ్మ ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. భర్త మృతి చెం దాడు. దీంతో అదే గ్రామానికి చెందిన మెండ్రు గుత్తి ఆంజనేయులు, మరో మైనర్‌ బాలుడు క లిసి ఆమెను గత జూన్‌ 26న రాత్రి హత్య చేసి ఆమె వద్ద ఉన్న నగదు, బంగారం దొంగిలించా రు. మృతదేహన్ని అదే గ్రామం సమీపంలో ఉన్న కొక్కిలేరు కాలువలో పడవేశారని ఎస్పీ తెలిపా రు. నిందితులను అరెస్టు చేసిన త్రిపురాంతకం పోలీసులను ఎస్పీ అభినందించారు. 

Updated Date - 2022-08-11T05:49:29+05:30 IST