ఈ పిల్లలు ఎంతో ముద్దొస్తున్నారు కదూ.. కానీ తల్లిదండ్రుల కళ్ల ముందే సజీవదహనం.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-04-05T20:42:34+05:30 IST

పై ఫొటోలోని పిల్లలను చూశారా? అభం శుభం తెలియని ఆ చిన్నారులను అకాల మృత్యువు కబళించింది.

ఈ పిల్లలు ఎంతో ముద్దొస్తున్నారు కదూ.. కానీ తల్లిదండ్రుల కళ్ల ముందే సజీవదహనం.. అసలేం జరిగిందంటే..

పై ఫొటోలోని పిల్లలను చూశారా? అభం శుభం తెలియని ఆ చిన్నారులను అకాల మృత్యువు కబళించింది. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఈ అక్కాచెల్లెళ్లు సజీవ దహనమై చనిపోయారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సోమవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. విషయం తెలిసిన వెంటనే పోలీసు కమిషనర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరి మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు.


రాజేంద్ర నగర్ న్యూ ప్రకాష్ నగర్‌లోని మురికివాడలో నివసిస్తున్న సోను, మమత దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారిలో పెద్దదైన ముక్కుకు ఐదేళ్లు, చిన్న పాప నందుకు మూడేళ్లు. సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటల్లో ఇల్లు మొత్తం కాలిపోయింది. తల్లిదండ్రుల కళ్ల ముందే ముక్కు, నందు సజీవ దహనమై పోయారు. 


ఇంటి ఆనవాలు కూడా లేకుండా పూర్తిగా కాలిపోయింది. ఇంట్లోని మొత్తం సామాన్లు ఆగ్నికి ఆహుతయ్యాయి. ముఖ్యంగా ఇద్దరు చిన్నారులు కాలిపోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ చిన్నారుల తల్లిదండ్రులు పోలీసుల ఎదుట కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Updated Date - 2022-04-05T20:42:34+05:30 IST