ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికి గాయాలు
ABN , First Publish Date - 2022-07-02T05:30:00+05:30 IST
ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికి గాయాలు
- ఆస్పత్రికి తరలింపు.. ఒకరి పరిస్థితి విషమం
పరిగి, జూలై 2 : ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరి యువకులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం శనివారం పరిగి మండలం రాఘవాపూర్ వద్ద జరిగింది. మండల పరిధిలోని సయ్యద్పల్లికి చెందిన షాబాద్ నరేష్(20), ఆలూరి మల్లేశ్లు బైక్పై పరిగి నుంచి స్వగ్రామానికి వెళుతుండగా, ఎదురుగా పరిగికి వస్తున్న (టీఎస్ 34 టీఏ 5729) నంబరు గల ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొట్టింది. దీంతో వారికి తీవ్రగాయాలు కాగా, స్థానికులు పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా, నరేష్ పరిస్థితి విషయంగా ఉండగా, మల్లేశ్ కారు విరిగింది. పరిగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.