Afghanistan: కాబూల్లో మళ్లీ పేలుళ్లు..ఇద్దరికి గాయాలు
ABN , First Publish Date - 2021-09-18T17:59:12+05:30 IST
అఫ్ఘానిస్థాన్ దేశంలోని కాబూల్ నగరంలో శనివారం జరిగిన పేలుడులో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు...
కాబూల్ : అఫ్ఘానిస్థాన్ దేశంలోని కాబూల్ నగరంలో శనివారం జరిగిన పేలుడులో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. కాబూల్ నగరంలోని 13వ పోలీసు జిల్లాలో మందుగుండు సామాగ్రి పేలుడు జరిగిందని, ఈ పేలుడులో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అఫ్ఘానిస్థాన్ దేశంలోని కాబూల్ నగరంలో తాము జరిపిన డ్రోన్ దాడి తమ తప్పిదమని అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ ఫ్రాంక్ మెకెంజీ శనివారం క్షమాపణలు చెప్పారు. కాబూల్ నగర విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడి జరిగిన తర్వాత ఐఎస్ఐఎస్-కె ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని, గత నెలలో కాబూల్లో అమెరికన్ దళాలు జరిపిన డ్రోన్ దాడి పొరపాటని అమెరికా మిలటరీ అంగీకరించింది. ఈ డ్రోన్ దాడిలో ఏడుగురు చిన్నారులతో సహా 10 మంది పౌరులు మరణించారు.