ఆటో- ట్యాంకర్‌ ఢీ ఇద్దరికి గాయాలు

ABN , First Publish Date - 2021-04-17T05:03:38+05:30 IST

మండలంలోని చౌటిపల్లె గ్రామం వద్ద శుక్రవారం ఆటో ను ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొన్న టనలో ఇద్దరికి గాయాలైనట్లు కొండాపురం ఎస్‌ఐ మంజునాథ తెలిపారు.

ఆటో- ట్యాంకర్‌ ఢీ ఇద్దరికి గాయాలు

కొండాపురం, ఏప్రిల్‌ 16: మండలంలోని చౌటిపల్లె గ్రామం వద్ద శుక్రవారం ఆటో ను ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొన్న టనలో ఇద్దరికి గాయాలైనట్లు కొండాపురం ఎస్‌ఐ మంజునాథ తెలిపారు. ముద్దనూ రు నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌, ఆటోలు చౌటిపల్లె గ్రామం వద్దనున్న స్పీడ్‌ బ్రేకర్‌ వద్దకు రాగానే ముందుగా వెళ్తున్న ఆటోను ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొంది. దీంతో ఆటో డ్రైవర్‌ మసూరప్ప, మరో మహిళ అం కాళమ్మకు గాయాలయ్యాయి. మసూ రప్పది అనంతపురం జిల్లా పెద్ద ఒడు గూరు కాగా అంకాళమ్మది ముద్దనూరు గ్రామమని  ఎస్‌ఐ తెలిపారు. ఆటో కూ డా కొద్దిగా దెబ్బతిన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. స్వల్పంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-04-17T05:03:38+05:30 IST