సింగపూర్‌లో ఇద్ద‌రు భార‌తీయుల‌కు 'క‌రోనా'

ABN , First Publish Date - 2020-03-29T18:10:55+05:30 IST

సింగపూర్ కూడా కరోనా వైరస్ తో పోరాడుతోంది. తాజాగా ఇద్దరు భారతీయులతో సహా 70 మంది కొత్త పాజిటివ్ రోగులను గుర్తించారు.

సింగపూర్‌లో ఇద్ద‌రు భార‌తీయుల‌కు 'క‌రోనా'

సింగపూర్: సింగపూర్ కూడా కరోనా వైరస్ తో పోరాడుతోంది. తాజాగా ఇద్దరు భారతీయులతో సహా 70 మంది కొత్త పాజిటివ్ రోగులను గుర్తించారు. సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇక్కడ మొత్తం రోగుల సంఖ్య 802 కు చేరుకుంది. ఈ మహమ్మారి కారణంగా  ఇంతవరకు ఇక్కడ ఒక్క మరణం కూడా సంభవించలేదు. శనివారం బయటపడిన 70 కేసుల్లో 41 మంది విదేశాల నుంచి సింగపూర్ వచ్చారు. సింగపూర్ లో కరోనా సోకిన ఇద్దరు భారతీయ రోగులలో ఒకరికి 21 సంవత్సరాలు, మరొక రోగికి 55 ఏళ్ళు. దీంతో సింగపూర్‌లో మొత్తం రోగుల సంఖ్య 802కు పెరిగింది. 

Updated Date - 2020-03-29T18:10:55+05:30 IST