Australiaలో వరదల బీభత్సం.. ఇద్దరు భారతీయులు మృతి

ABN , First Publish Date - 2022-03-09T17:28:54+05:30 IST

ఆస్ట్రేలియాలో ఘోరం జరిగింది. భారత సంతతికి చెందిన తల్లీకొడుకులు మృత్యువాతపడ్డారు. గత కొద్ది రోజులుగా వర్షాలు ఆస్ట్రేలియాలో బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున వరదలు సం

Australiaలో వరదల బీభత్సం.. ఇద్దరు భారతీయులు మృతి

ఎన్నారై డెస్క్: ఆస్ట్రేలియాలో ఘోరం జరిగింది. భారత సంతతికి చెందిన తల్లీకొడుకులు మృత్యువాతపడ్డారు. గత కొద్ది రోజులుగా వర్షాలు ఆస్ట్రేలియాలో బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. ఈ క్రమంలో భారత సంతతికి చెందిన హేమలతాసోల్హైర్ సత్చితానందం, ఆమె 34 ఏళ్ల కుమారుడు బ్రమూత్ సోమవారం కారుతో సహా వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను  కూపర్స్ క్రీక్ కెనాల్‌లో న్యూసౌత్ వేల్స్‌ పోలీసులు గుర్తించారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా.. తల్లీకొడుకుల మృతిపై స్థానిక అధికారులు విచారం వ్యక్తం చేశారు.  




Updated Date - 2022-03-09T17:28:54+05:30 IST