ట్రంప్ పర్యటనలో భారత సంతతి అధికారులు..!
ABN , First Publish Date - 2020-02-24T03:01:39+05:30 IST
అమెరికా అధ్యక్షుడు కుటుంబ సమేతంగా తొలిసారి భారత పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ట్రంప్ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడి
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు కుటుంబ సమేతంగా తొలిసారి భారత పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ట్రంప్ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడితోపాటు ఇద్దరు భారత సంతతి అధికారులు కూడా సోమవారంరోజు ఇండియాకు రానున్నారు. వివరాల్లోకి వెళితే.. అజిత్ పై.. ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్కు చైర్మన్గా భాద్యతలు నిర్వరిస్తున్నారు. ఇకపోతే కష్ పటేల్.. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికారిగా పని చేస్తున్నారు. అజిత్ పై తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు. వారి స్వస్థలం మహారాష్ట్ర. 1971లో వీళ్లు అమెరికా వెళ్లిపోగా.. కాన్సస్లో అజిత్ పై జన్మించారు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న అజిత్ పాయ్.. ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ ఛైర్మన్గా పని చేస్తున్నారు. కష్ పటేల్.. న్యూయార్క్లో జన్మించగా ఆయన పూర్వికుల మూలాలు గుజరాత్లో ఉన్నాయి.