ఓక్ బ్రూక్ ట్రస్టీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన సురేష్ రెడ్డి

ABN , First Publish Date - 2021-04-09T21:20:11+05:30 IST

అమెరికాలో జరిగిన ఎన్నికల్లో భారతీయులు సత్తా చాటారు. ప్రత్యర్థులపై ఘన విజయం సాధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చికాగోలోని ఓక్ బ్రూక్ ట్రస్టీలోని మూడు ఖాళీలకు జరిగిన ఎన్నికల్లో భారత్‌కు చెం

ఓక్ బ్రూక్ ట్రస్టీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన సురేష్ రెడ్డి

వాషింగ్టన్: అమెరికాలో జరిగిన ఎన్నికల్లో భారతీయులు సత్తా చాటారు. ప్రత్యర్థులపై ఘన విజయం సాధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చికాగోలోని ఓక్ బ్రూక్ ట్రస్టీలోని మూడు ఖాళీలకు జరిగిన ఎన్నికల్లో భారత్‌కు చెందిన డాక్టర్ సురేష్ రెడ్డి బృందం విజయఢంకా మోగించింది. మంగళవారం రోజు జరిగిన ఈ ఎన్నికల్లో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్ (ఏఏపీఐ) మాజీ అధ్యక్షుడు సురేష్ రెడ్డితోపాటు.. ఆయన బృందంలోని సభ్యులు లారెన్స్ ‘ల్యారీ’ హెర్మాన్, జేమ్స్ పి. నేగిల్ కూడా గెలుపొందారు. ఈ సందర్భంగా సరేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఓక్ బ్రూమ్ ప్రాంతంలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

Updated Date - 2021-04-09T21:20:11+05:30 IST