రెండు గంటలు కుండపోత

ABN , First Publish Date - 2021-06-24T05:39:58+05:30 IST

వరుణుడు కరు ణించాడు. వేసవి ముగిసినప్పటికీ నిన్నటి వరకు భానుడి భగభగలతో అల్లాడిపోయిన జనం బుధవారం కురిసిన కుండపోత వర్షానికి ఉపశమనం పొందారు.

రెండు గంటలు కుండపోత
నర్సీపట్నంలోని వెంకునాయుడుపేట స్కూల్‌ రోడ్డులో నిలిచి వర్షపు నీరు


 నాలుగు మండలాల్లో భారీ వర్షం

 వాతావరణం చల్లబడడంతో జనం ఆనందం

 వ్యవసాయ పనులకు అన్నదాతలు సన్నద్ధం

నర్సీపట్నం/నర్సీపట్నం రూరల్‌, గొలుగొండ/ మాకవరపాలెం, జూన్‌ 23 : వరుణుడు కరు ణించాడు. వేసవి ముగిసినప్పటికీ నిన్నటి వరకు భానుడి భగభగలతో అల్లాడిపోయిన జనం బుధవారం కురిసిన కుండపోత వర్షానికి ఉపశమనం పొందారు. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన వాన పద కొండు గంటల వరకు రెండు గంటలపాటు ఏకధాటిగా పండింది. దీంతో అంతటా వాతావరణం చల్లబడింది. నర్సీపట్నం, మాకవరపాలెం, గొలుగొండ, నాతవరం మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమ య్యాయి. కొన్నిచోట్ల రోడ్లపై వర్షపు నిలిచిపోవడంతో వాహన చోదకులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. పలుచోట్ల పల్లెరోడ్లు బురదగా మారాయి. ఈ వర్షం వ్యవసాయ పనులకు మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2021-06-24T05:39:58+05:30 IST