ఒకరు రాయాల్సిన పరీక్షకు.. మరొకరు హాజరుకావడంతో..

ABN , First Publish Date - 2020-09-28T09:46:26+05:30 IST

ఒకరు రాయాల్సిన పరీక్షకు మరొకరు హాజరుకావడంతో హర్యానాలోని పంచకుల నగర

ఒకరు రాయాల్సిన పరీక్షకు.. మరొకరు హాజరుకావడంతో..

పంచకుల: ఒకరు రాయాల్సిన పరీక్షకు మరొకరు హాజరుకావడంతో హర్యానాలోని పంచకుల నగర పోలీసులు ఆదివారం ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ అప్రీషియేషన్ అండ్ అప్లికేషన్స్(ఎస్‌ఈటీసీ) పరీక్షకు మహేందర్ అనే వ్యక్తి హాజరుకావాల్సి ఉంది. అయితే మహేందర్ బదులు అతడి స్థానంలో సుమిత్ అనే వ్యక్తి పరీక్షకు హాజరయ్యాడు. రోషన్ లాల్ అనే అధికారి ఈ గ్యాంబ్లింగ్‌ను కనిపెట్టి.. వీరిద్దరిపై సెప్టెంబర్ 26న పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై చీటింగ్ కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఆదివారం నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు.

Updated Date - 2020-09-28T09:46:26+05:30 IST