చిరుత దాడిలో రెండు మేకలు మృతి
ABN , First Publish Date - 2021-02-25T05:42:26+05:30 IST
చిరుతపులి దాడిలో రెండు మేకలు మృతి చెందిన ఘటన మండలంలోని భొగుడ భూపతిపూర్లో బుధవారం సాయం త్రం చోటు చేసుకుంది.
హవేళీఘణపూర్, ఫిబ్రవరి 24: చిరుతపులి దాడిలో రెండు మేకలు మృతి చెందిన ఘటన మండలంలోని భొగుడ భూపతిపూర్లో బుధవారం సాయం త్రం చోటు చేసుకుంది. బాధితుడి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన వం కాయల చంద్రం అటవీప్రాంతంలో మేకలు మేపుతుండగా చిరుతపులి వచ్చి మందపై దాడిచేసి మేకను చంపింది. చిరుతను చూసిన చంద్రయ్య పరుగులు పెట్టగా మందవెంట ఉన్న కుక్కలు మొరగడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయిందన్నారు. కాగా అదే గ్రామానికి లంబాడి లక్ష్మణ్ కూడా మేకలను మేతకు తీసుకెళ్లి ఇంటికి తీసుకువస్తుండగా మేకపై దాడి చేయడంతో మరో మేక అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, ఫారెస్టు అధికారులు వెళ్లి పరిశీలించారు.