ఇద్దరు బాలికలు అదృశ్యం.. బాలానగర్‌లో కలకలం

ABN , First Publish Date - 2020-07-14T03:03:22+05:30 IST

బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. తల్లిదండ్రులకు..

ఇద్దరు బాలికలు అదృశ్యం.. బాలానగర్‌లో కలకలం

హైదరాబాద్: బాలానగర్  పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. గౌతమ్‌నగర్‌కు చెందిన సరితా దేవి, రాంబాలీస్ సహాని దంపతుల కూతురు కాజల్ కుమారితోపాటు వినాయక్ నగర్‌కు చెందిన లక్ష్మి, సత్యనారాయణ కూతురు సురేఖగా గుర్తించారు. స్థానికులను, బంధువులను విచారించగా తమకు కనిపించలేదని తెలియజేయడంతో తల్లిదండ్రులు.. బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-07-14T03:03:22+05:30 IST