ఇద్దరు స్నేహితుల తింగరి పని.. ఒకరి భార్యను మరొకరు పెళ్లి చేసుకున్నారు.. తర్వాత ఏమైందంటే..
ABN , First Publish Date - 2022-03-03T22:57:19+05:30 IST
వారిద్దరూ స్నేహితులు.. కుటుంబాలతో పక్క పక్క ఇళ్లలోనే ఉండేవారు.. ఆ క్రమంలో ఒకరి భార్యతో మరొకరు ప్రేమలో పడ్డారు..
వారిద్దరూ స్నేహితులు.. కుటుంబాలతో పక్క పక్క ఇళ్లలోనే ఉండేవారు.. ఆ క్రమంలో ఒకరి భార్యతో మరొకరు ప్రేమలో పడ్డారు.. దాంతో ఒకరి భార్యను మరొకరు వివాహం చేసుకున్నారు.. అయితే విడాకుల సమయంలో ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో ఇద్దరి మధ్యా అభిప్రాయ భేదాలు తలెత్తాయి.. ఇద్దరూ కొట్టుకున్నారు.. ఈ క్రమంలో ఒక స్నేహితుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్లో ఈ ఘటన జరిగింది.
రాజ్గఢ్కు చెందిన మంగీలాల్ అనే వ్యక్తి 2011లో కృష్ణాబాయి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ రెండేళ్ల కూతురు ఉంది. కొన్ని రోజుల తర్వాత వారి పక్కింట్లోకి హేమరాజ్ అనే వ్యక్తి తన భార్య మమతతో కలిసి దిగాడు. రెండు కుటుంబాల మధ్య స్నేహం కుదిరింది. ఈ క్రమంలో కృష్ణాబాయితో హేమరాజ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న మంగీలాల్ 2014లో తన భార్యను హేమరాజ్కు ఇచ్చి వివాహం చేశాడు. ఆ సమయంలో విడాకుల పంచాయితీ ఆచారం ప్రకారం మంగీలాల్కు హేమరాజ్ రూ.1.50 లక్షలు ఇచ్చాడు. ఇద్దరు భార్యలతో కలిసి జీవితం ప్రారంభించాడు.
కొన్ని రోజులకు హేమరాజ్ భార్య మమత.. మంగీలాల్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో 2016లో మమత, మంగీలాల్ వివాహం చేసుకున్నారు. అయితే ఆ సమయంలో విడాకుల పంచాయితీ ఆచారం ప్రకారం హేమరాజ్కు ఇవ్వాల్సిన డబ్బులను మంగీలాల్ ఇవ్వలేదు. ఇటీవల ఆ డబ్బు విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మంగీలాల్ను హేమరాజ్ అందరి ముందు కొట్టాడు. తీవ్ర మనస్థాపానికి గురైన మంగీలాల్ మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.