వేర్వేరు చోట్ల ఇద్దరు బలవన్మరణం

ABN , First Publish Date - 2021-01-14T06:42:21+05:30 IST

భర్త వేధింపులు తాళలేక ఒకరు.. దీర్ఘకాలిక రోగాలు నయంకాక మరొకరు ఆత్మహత్య చేసు కున్న సంఘటనలు బుధవారం చోటుచేసుకున్నాయి

వేర్వేరు చోట్ల ఇద్దరు బలవన్మరణం
సంతేబిదునూరులో ఆత్మహత్య చేసుకున్న సుమలత


భర్త వేధింపులు తాళలేక ఒకరు.. దీర్ఘకాలిక రోగాలు నయంకాక మరొకరు ఆత్మహత్య చేసు కున్న సంఘటనలు బుధవారం చోటుచేసుకున్నాయి. హిందూపురం మండలం సంతేబిదునూరులో భర్త వేధింపులు తాళలేక సుమలత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అమరాపురం మండలం దక్షిణగొల్లహట్టికి చెందిన ముద్దనాగమ్మ కడుపునొప్పితో బాధపడుతూ నయం కాక ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.  


 హిందూపురం టౌన్‌, జనవరి 13 :భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన హిందూపురం మండలంలోని సంతేబిదునూరులో చోటుచేసుకుంది. ఎస్‌ఐ ఆజాద్‌ తెలిపిన వివరాల మేరకు సంతేబిదునూరుకు చెందిన సురే్‌షబాబుకు పరిగి మండలం గొర్రిపల్లికి చెందిన సుమలత(30) తో 12ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని వే ధిస్తుండేవాడు. ఈ తరుణంలో మూడు రోజుల క్రితం కూడా రూ.60వేలు తీసుకురావాలంటూ ఒత్తిడి తెచ్చాడు. అంతేకాక తరచూ వేధింపులకు గురిచేస్తుండటంతో మానసిక క్షోభకు గురై జీవితంపై విరక్తిచెంది బుధవారం మధ్యాహ్నం ఇంటిలో ఎవరూ లేని సమయంలో బాత్రూమ్‌లోకి వెళ్లి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం హిందూపురం ఆసుపత్రికి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


  అమరాపురం: మండలంలోని దక్షిణగొల్లహట్టికి చెందిన ముద్దనాగమ్మ(62) ఇంటిలో దూలానికి చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. మృతురాలి కుమారుడు ఈరన్న అందించిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తన తల్లి కడుపునొప్పి, మధుమేహం, బీపీ  వ్యాధులతో బాధపడుతుండేది. వివిధ చోట్ల వైద్య చికిత్సలు అందించినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంటిలోనే దూలానికి చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని పోస్టుమా ర్టం నిమిత్తం మడకశిర ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాన్ని పంపినట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-01-14T06:42:21+05:30 IST