అహ్మదాబాద్: సుమారు ఏడు నెలల తర్వాత భారత్, కువైత్ మధ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. దీంతో ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీ పెరిగిపోయింది. దీనిని దృష్టిలో పెట్టుకుని తాజాగా మరో రెండు కొత్త విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఇరు దేశాలకు చెందిన విమానయాన సంస్థలు ప్రకటించాయి. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ(ఎస్వీపీఐ) విమానాశ్రయం నుంచి కువైత్కు ఈ విమాన సర్వీసులు ఉంటాయి. ఎయిర్ ఇండియా, కువైత్ ఎయిర్లైన్స్ ఈ విమాన సర్వీసులు నడపనున్నాయి.
ఇవి కూడా చదవండి..
Dubai కీలక ప్రకటన.. ఇకపై UAE కి వచ్చేవాళ్లు ఎంత డబ్బు తీసుకురావచ్చంటే..
ఆ రెండు దేశాల వారికి e-visas లు ఇచ్చేది లేదన్న India..
అలాగే ఎస్వీపీఐ అధికారుల సమాచారం ప్రకారం లండన్కు కూడా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇరుదేశాల మధ్య కుదిరిన ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా ఈ విమాన సర్వీసు నడిపిస్తున్నట్లు ఎస్వీపీఐ వెల్లడించింది. కాగా, అంతర్జాతీయ ప్రయాణాలు మొదలైన తర్వాత మొట్టమొదట ఈ ఎయిర్పోర్టు నుంచి దుబాయ్కు తొలి విమానం నడిపినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే రూట్లో ఇటీవల అదనంగా మరో సర్వీసును కూడా నడిపిస్తున్నట్లు ఎస్వీపీఐ యాజమాన్యం పేర్కొంది.