వదిన అంత్యక్రియలకు వెళుతూ మరిది మృతి

ABN , First Publish Date - 2022-05-28T06:54:24+05:30 IST

వదిన అంత్యక్రియలకు వెళుతున్న ఓ వ్యక్తి మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ విషాద సంఘటన ఉయ్యాలవాడ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది.

వదిన అంత్యక్రియలకు వెళుతూ మరిది మృతి
సుబ్బమ్మ, పుల్లయ్య (ఫైల్‌ ఫొటోలు)

ఉయ్యాలవాడ, మే 27: వదిన అంత్యక్రియలకు వెళుతున్న ఓ వ్యక్తి మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ విషాద సంఘటన ఉయ్యాలవాడ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి మృతుల కుటుంబీకులు తెలిపిన వివరాలివీ... ఉయ్యాలవాడకు చెందిన దాసరి సుబ్బమ్మ (65) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. శుక్రవారం సుబ్బమ్మ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశానానికి తీసుకెళ్తుండగా...ఆమె మరిది దాసరి పుల్లయ్య (65) కూడా వెళ్లారు. మార్గమధ్యలో ఆయన సృహకోల్పోయి పడిపోయారు. కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించగా... గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సుబ్బమ్మకు భర్త, ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పుల్లయ్యకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. శుక్రవారం ఉదయం సుబ్బమ్మ అంత్యక్రియలు, సాయంత్రం పుల్లయ్య అంత్యక్రియలు నిర్వహించారు.


Updated Date - 2022-05-28T06:54:24+05:30 IST