దుబాయి నుంచి వచ్చిన జగిత్యాల వాసులకు కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2021-03-07T07:20:24+05:30 IST
దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు జగిత్యాల వాసులకు యూకే స్ట్రెయిన్ సోకడంతో వారిని హైదరాబాద్లోని
జగిత్యాల: దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు జగిత్యాల వాసులకు యూకే స్ట్రెయిన్ సోకడంతో అధికారులు వారిని హైదరాబాద్లోని టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరూ జగిత్యాల జిల్లాలోని వెంకటాపురం, ముత్యంపేట గ్రామాలకు చెందినవారని అధికారులు వెల్లడించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరూ ఫిబ్రవరి 25న దుబాయి నుంచి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అనంతరం అధికారులు వారి నుంచి శాంపిల్స్ను సేకరించారు. శాంపిల్స్ను పరీక్షించగా వారిద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా వైద్యులు, అధికారులు సూచించారు. అనంతరం మరిన్ని పరీక్షలు చేయగా ఇద్దరికీ యూకే స్ట్రెయిన్ సోకినట్టు తేలింది. ఈ నేపథ్యంలో వారిద్దరిని వెంటనే హైదరాబాద్లోని టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వారితో కాంటాక్ట్ అయిన 14 మందికి పరీక్షలు చేయగా.. ఆరుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. మరిన్ని పరీక్షల కోసం ఈ 14 శాంపిల్స్ను వైద్యులు హైదరాబాద్కు పంపారు.