వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2022-08-09T05:36:44+05:30 IST

మండలంలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

గంట్యాడ: మండలంలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దీనికి సంబంధించి గంట్యాడ ఎస్‌ కిల్లారి కిరణ్‌కుమార్‌నాయుడు అందిం చిన వివరాలు ఇలా ఉన్నాయి. రామవరం నుంచి బౌడ్డ వరకూ జరుగుతున్న రహదారి విస్తరణలో భాగంగా రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌ స్తంభాలను వేరే చోట కు మార్పు చేస్తున్నారు. ఈ పనికి జార్ఖాండ్‌కు చెందిన రాహుల్‌ జందార్‌ అనే వ్యక్తి ఎస్‌ఆర్‌ఆర్‌ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం మదనా పురం వద్ద విద్యుత్‌ స్తంభం ఎక్కి ఆయన పని చేస్తుండగా, ఇంజినీరింగ్‌ అధికారు ల నిర్లక్ష్యం వల్ల విద్యుత్‌ వైరు రాహుల్‌(20)కు తగిలింది. దీంతో వెంటనే కిందకు పడిపోయాడు. వెంటనే రాహుల్‌ బంధువు  జగన్నాథ్‌ జందార్‌ను స్థానిక ఆసుపత్రి కి తీసుకుని వెళ్లారు. అప్పటికే రాహుల్‌ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.  


ఇదిలా ఉంటే, కొండతామరాపల్లి కూడలిలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వసాది గ్రామానికి చెందిన భూమిరెడ్డి వెంకటరావు(49) మృతిచెం దారు. వెంకటరావు, అదే గ్రామానికి చెందిన అర్జున్‌ కలిసి ద్విచక్ర వాహనంపై కొండతామారాపల్లికి వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా, కూడలి వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన వెంకట రావును విజయనగరం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. భార్య సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశా రు. వెంకటరావుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  


Updated Date - 2022-08-09T05:36:44+05:30 IST