తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు...ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2021-06-21T17:16:32+05:30 IST

తమిళనాడు రాష్ట్రంలోని విరూధునగర్ జిల్లా శివకాశీ సమీపంలోని తయ్యాలీపట్టి వద్ద అక్రమంగా నడుస్తున్న బాణసంచా ఫ్యాక్టరీలో...

తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు...ఇద్దరి మృతి

శివకాశీ (తమిళనాడు): తమిళనాడు రాష్ట్రంలోని విరూధునగర్ జిల్లా శివకాశీ సమీపంలోని తయ్యాలీపట్టి వద్ద అక్రమంగా నడుస్తున్న బాణసంచా ఫ్యాక్టరీలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ఇద్దరు మరణించగా, మరో  ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స  చేస్తున్నారు. అగ్నిమాపకశాఖ, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి సహాయ పనులు చేపట్టారు. అక్రమంగా బాణసంచాను తయారు చేస్తుండగా ఫ్యాక్టరీలో పేలుడు జరిగిందని పోలీసులు చెప్పారు. ఈ పేలుడు వల్ల ఫ్యాక్టరీ భవనం కుప్పకూలింది. 

Updated Date - 2021-06-21T17:16:32+05:30 IST