అమెరికాలో మరోమారు కాల్పుల మోత
ABN , First Publish Date - 2020-07-06T08:32:20+05:30 IST
అమెరికాలో స్వాతంత్ర్య దినోత్సవం రోజుల కాల్పుల మోత మోగింది. సౌత్ కెరోలినాలోని
గ్రీన్విల్లే, సౌత్ కెరోలినా: అమెరికాలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున కాల్పుల మోత మోగింది. సౌత్ కెరోలినాలోని గ్రీన్విల్లేలో ఉన్న ఓ నైట్క్లబ్లో కాల్పుల కలకలం రేగింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పార్టీ చేసుకుంటున్న వారిపై దుండగులు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. మరో పది మంది తీవ్ర గాయాలపాలవడంతో... వారికి ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం రాత్రి నైట్క్లబ్లో దాదాపు 200 మంది సంబరాలు చేసుకుంటున్నారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో దుండగులు ఒక్కసారిగా అక్కడి వారిపై కాల్పులు జరిపారు. కాల్పులు మోత విన్న పోలీసులు వెంటనే నైట్క్లబ్కు చేరుకోగా.. అప్పటికే దుండగులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన చోటుచేసుకున్న కొద్ది దూరంలోనే అంతకుముందు రోజు కూడా కాల్పుల కలకలం రేగడంతో.. పోలీసులు ఈ రెండు ఘటనలకు పాల్పడింది ఒకరేనని అనుమానిస్తున్నారు.