రిమ్స్లో ఇద్దరు కరోనా అనుమానితులు
ABN , First Publish Date - 2020-03-27T09:48:48+05:30 IST
కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గురువారం ఇరువురు కరోనా అనుమానితులు చేరినట్లు రిమ్స్ ఆర్ఎంఓ డాక్టర్
కడప (సెవెన్రోడ్సు) మార్చి 26: కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గురువారం ఇరువురు కరోనా అనుమానితులు చేరినట్లు రిమ్స్ ఆర్ఎంఓ డాక్టర్ కొండయ్య తెలిపారు. పెండ్లిమర్రికి చెందిన సుమారు 30 ఏళ్ల వయస్సు గల వ్యక్తి కేరళ నుంచి వచ్చాడని, కడపకు చెందిన 40 సంవత్సరల వయస్సు గల వ్యక్తి కోల్కత్తా నుంచి రావడంతో ముందు జాగ్రత్తలో భాగంగా వారి స్వాబ్లను తీసి తిరుపతి స్విమ్స్కు పంపామన్నారు.
నివేదికలు శుక్రవారం వస్తాయన్నారు. కాగా ఇప్పటి వరకు రిమ్స్లో 22 మంది అనుమానితులకు పరీక్షలు చేశామని, అందులో 18 మందికి నెగిటివ్ వచ్చింది. మిగిలిన నలుగురికి రిపోర్టుల కోసం నిరీక్షిస్తున్నామన్నారు.కడపలో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్ రాలేదని తెలిపారు.