నల్లమల అడవిలో ఇద్దరు ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-07-04T04:14:47+05:30 IST
నల్లమల అడవిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి
నాగర్కర్నూల్: నల్లమల అడవిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పురుగుల మందు తాగి యువకుడు, వివాహిత ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడిని తీసుకొని యువకుడితో మహిళ వెళ్లింది. నల్లమల అడవిలో మృతదేహాల పక్కనే ఏడుస్తూ బాలుడు కూర్చున్నాడు. బాలుడి ఏడుపు విని మృతదేహాలను బంధువులు గుర్తించారు. మృతులను రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టిప్పలపల్లి వాసులుగా గుర్తించారు.